Sunday, May 8, 2016

పాదగోపనం


పాదగోపనం

సాహితీమిత్రులారా!
పద్యంలో ఒక పాదాన్ని మిగిలిన పాదాలలో గోపనంచేసి చెప్పడాన్ని
పాదగోపనం లేక పాదగూఢం అంటారు.
ఈ గోపనం ఒక క్రమంలో కొందరు కూర్చారు.
క్రమరహితంగా కొందరు కూర్చారు.
ఇది ఇలా ఉంటే ఏపాదాన్ని గోపనం చేస్తారో దాన్ని
ఆ పేరుతో పిలుస్తారు.
మొదటి పాదం గోపనమైతే అది ప్రథమగూఢమని,
రెండవదైతే ద్వితీయ గూఢమని,
మూడవదైతే తృతీయ గూఢమని,
నాల్గవదైతే చతుర్థ గూఢమని పిలుస్తారు.
ఇక్కడ మనం
"అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం"లోని
26 వ శ్లోకాన్ని తెలుసుకుంటుంన్నాము.
ఇది ఒక క్రమంలో పాదగూఢం చేయబడిన చతుర్థపాదగూఢం.

పాపం మహిష్ఠం శ్యమాంగ స్థిరతారక్ష్య గమాధునా
శమయస్వాబ్ధి కన్యేశ పాహిమాం రంగనాయక


(నీలదేహా నిరంతరం మొక్కవోని విక్రమం
గల దృఢుడైన గరుడునిపై ప్రయాణించువాడా!
సాగరకన్యకా వల్లభా! రంగనాయకా!
గొప్పదైన ఈ లోకమందలి కలుషాదులను
అణచివేసి నన్ను రక్షించు.)

ఈ శ్లోకంలో 1,3,5,7,9,11,13,15 అక్షరాలను వరుసగా
తీసుకుంటే పాహిమాం రగనాయక - అని వస్తుంది.
అది నాల్గవపాదం. ఇక్కడ మరో విషయం గమనించాలి
రంగనాయకకు బదులుగా రగనాయక అని వచ్చింది.
చిత్రకవిత్వంలో పూర్ణనుస్వార విసర్గలకు
నియమం సడలింపు కలదు.

No comments: