Sunday, September 24, 2017

కృష్ణశాస్త్రీయం


కృష్ణశాస్త్రీయం




సాహితీమిత్రులారా!


నెమలి జాతీయ విహంగంగా నిర్ణయించిన సందర్భాన కవి సమ్మేళనం 
జరిగితే వారి వారి కవితలు ఎలా ఉంటాయి అనే ఊహకు రూపకల్పనే
ఈ పేరడీ


గంధర్వ లోకంలో కవితా విపంచిపై వియోగగీతాలు ఆలపించే కవి 
దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి గారు. అయిదు దశాబ్దాల క్రితం భావ
కవికి నిర్వచనంగా నిలిచారు. ఆంగ్లేయుల కాల్పనికవాదం. తెలుగు
వారి మెళుకువలు, లలిత లలితమైన పదజాలము శాస్త్రి గారి స్వార్జితాలు.
వారి గీతిక ఇలా విన్పిస్తుంది.



శిశిర శిశిర బందు

మధుర వేదన రగిలి

సోలియున్నది మనసు

చూపకే నీ వింత సొగసు

ఏలనే నీ కంత అలుసు

కరిమబ్బు మేనితో
        స్వామి వచ్చే వేళ

చివురాకు జొంపాల
        పురివిప్పి యాడేవు

భ్రమసి పోతివో యేమొ
        అలసి పోదువొ యేమొ

బృందావనమ్మెల్ల
        నీ మాటె, నీ ఆటె

ఏ నాటి పుణ్యమో
        ఏ నోముల ఫలమొ


(శ్రీరమణ పేరడీలు నుండి .....)

No comments: