Wednesday, September 13, 2017

పరిశుద్ధ రచన


పరిశుద్ధ రచన




సాహితీమిత్రులారా!

సర్వశ్రీ అనే అభ్యుదయ కవి తన వచన కవితా సంపుటికి
పీఠిక వ్రాయండని ఒక క్రైస్తవ మతాచార్యుని కోరినపుడు 
వారి శైలి యిలా సాగుతుంది....

సహోదరుడైన సర్వశ్రీ గ్రంథము మిక్కిలి కొనియాడతగినదై యున్నది.
పాపుల యొక్కయు, జీవితము యొక్కయు, దేశము యొక్కయు నిజమైన 
విషయములు యిందు వ్రాయబడియున్నవి. ఈలాగున వుత్తమ గ్రంథములను 
రచించుటవలన సహచరులకు మిక్కిలిగా మేలు చేసినవాడు అగుచున్నాడు. 
మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును. నీతిని విత్తువాడు శాశ్వతమైన 
బహుమానము నొందును. ఇట్టి వ్రాతలు వ్రాయువాని తల మీదికి దీవెనలు వచ్చును.
ఈ లాగున యీ యొక్క గ్రంథమును ప్రకటించుట వుత్తమమై యున్నది.

(బైబిలు శైని అనుకరించుటడానికే యిది వ్రాయబడినది.)

(శ్రీరమణ పేరడీలు నుండి-)

No comments: