Friday, December 27, 2019

గుమ్ము బుస్సు ఱింగు బొణుగు


గుమ్ము బుస్సు ఱింగు బొణుగు




సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో రాయలవారి అనుజ్ఞ తీసుకొని
మొల్లను పరీక్షింప శ్రీమహావిష్ణువు గజేంద్రుని రక్షించు సమయంలో
ఏ విధంగా వైకుంఠం నుండి ప్రయాణమై గజేంద్రుని వద్దకు పోయాడో
వివరించే విధంగా సీసపద్యంలో వరుసగా నాలుగు పాదాలలో
గుమ్ము, బుస్సు, ఱింగు, బొణుగు - ఈ పదాలను ఉపయోగించి చెప్పమన్నాడు మొల్లను.
అప్పుడా కవయిత్రీరత్నం ఒకమారు ఆకాశం వంక దృష్ఠిని సారించి, మనస్సులో రామచంద్రుని నిల్పి చెప్పడం తన మృదుమధుర గంభీర స్వరంతో మొదలెట్టింది.......

సీ.
 అనిలాభిహత దక్షిణావర్త శంఖంబు
            గుంఫితంబై కేల గుమ్ము రనఁగ
     గొడగయి తఱచుగాఁ బడగ లొక్కెడ దట్టి
            భుజగాధిపతి మీద బుస్సు రనఁగ
    చరచి నిబ్బరముగా బరతెంచు ఖగరాజు
            ఱెక్కగాడ్పులు మింట ఱింగు రనఁగ
    దొంతి బ్రహ్మండ పంక్తులు బొజ్జలోనుండి
            బెనకి యొక్కొకమారు బొణుగు రనఁగ
తే.గీ.  కూక కనుచూపుమేరకుఁ గోక విసరి
        వెఱకు! వెఱవకు! వెఱవకు! వెఱవ! కనుచు
        నుద్ద వడి వచ్చి గజరాజు నొద్ద వ్రాలె
        నార్తరక్షణ చణుఁడు నారాయణుండు

అత్యంత మనోహరమైత ఈ పద్యం పూర్తవగానే సభాసదులు
కరతాళధ్వనులచే తమ హర్షాన్ని తెలియజేశారు.
దానితో రాయలవారి సత్కారం లభించింది.

1 comment:

Anonymous said...

ఇవే మరి పైకూలు అంటే. నువ్వు పైకూలు కక్కినప్పుడల్లా జెల్లకాయలు కొట్టడం తప్పదు.