Sunday, December 22, 2019

వలవదా మీద సురభాష నిలుపరాదు


వలవదా మీద సురభాష నిలుపరాదు



సాహితీమిత్రులారా!


మరింగంటి సింగరాచార్యులు శుద్ధాంధ్ర నిరోష్ఠ్య కావ్యరచనకు ఆద్యుడు
ఆయనే తన శుద్ధాంధ్రనిరోష్ఠ్యసీతాకళ్యాణ కావ్యంతో ఈ విధంగా నిరోష్ఠ్యనియమాన్ని ఆచరించలేదు. ఇలాంటివి అనేక మంది కవులు
తవ కావ్యాల్లో చేసివున్నారు.
మరింగంటి సింగరాచార్యులవారు తన కృత్యాదిన ఈ విధంగా చెప్పివున్నారు.

అరయ కగచజటడతదనా యలసహ
రద్వయమెకాని యొండక్షరములు చొఱవు
మఱియు నౌత్వోత్వములు కొమ్ము మాముడియు
వలవదా మీద సురభాష నిలుపరాదు
                                                       (శుద్ధాంధ్రనిరోష్ఠ్యసీతాకళ్యాణం-1-34)

ఈ పద్యాన్ని బట్టి ఆయన పెట్టుకొన్న నిర్యోష్ఠ్య నియమమున
అచ్చులు ఔ,ఓ,ఒ,ఉ,ఊ ల తర్వాత వత్తు తీసుకోబడింది
దీనికి ఉదాహరణగా ఈ క్రింది పద్యం చెప్పవచ్చు.

జిగిచన్గట్లని యాడందీఱైన లేచెక్కిళ్ళ చక్కిన్ని గ
న్నిగ లీనంగఁగ డారికంటి సిరిడాల్ నిండంగ గై చిన్నియల్ 
తెగలై నల్దెసలాని చక్కగఁజికిల్ సేయన్ నెఱాసిగ్గెదన్ 
దగలన్ రానెలఁజేరి కాళ్ళకడ చెంతన్ సాగిలెన్ నాతి దాన్
                                                                       (శుద్ధాంధ్రనిరోష్ఠ్యసీతాకళ్యాణం- 2-63)


No comments: