Wednesday, December 25, 2019

శూర్పనఖా విలాపం


శూర్పనఖా విలాపం




సాహితీమిత్రులారా!

చిత్రకావ్యాలలో అనేక చిత్రాలు. అందులో శబ్దచిత్రం ఒకటి.
ఇందులో చిత్రాలు కొల్లలు. చిత్రకవిత్వాభిలాషులకు వీటిని గురించి 
వింటూంటే చూస్తుంటే చదువుతూంటే సమయమే తెలియదు.
మేల్పుత్తూర్ నారాయణ భట్ట కవి వరులు విరచించారు ఒక అద్భుత
చిత్రకావ్యం.

రామలక్ష్మణుల అరణ్యవాస సమయంలో శూర్పనఖ రావడం జరిగిందికదా అక్కడ జరిగిన సంఘటనలో లక్ష్మణుడు ఆమెకు ముక్కు చెవులు కోశాడుకదా మన లచ్చన్న. ఆమె అలాగే వెళ్ళి రావణుని సభలో మాట్లాడిందికదా అప్పుడు ఆమె అనునాశికాలను పలకలేదు కదా
ఎందుకంటే ఆమెకు ముక్కులేదు. మరి ఆమె ఎలా మాట్లాడింది వారికి ఎలా అర్థమైంది అని కొందరు వ్యంగ్యంగా అడుగుతుంటారు. సరిగ్గా అలాంటి ఆలోచనే మన నారాయణ భట్టుగారికి వచ్చింది దాని ఫలితమే శూర్పనఖా విలాపం. ఇది నిరనునాశికంగా వ్రాయబడింది. దీన్నే నిరనునాశిక చంపువు అని కూడా పిలుస్తారు.
ఇందులోని గద్యపద్యాలను ముక్కుమూసి చదవవచ్చు.

మనం ముక్కుతో ఒక రెండుమూడు వాక్యాలైనా చెప్పగలమా!
ఏమో! ఆలోచించాల్సందే కదా
ఇది చాల చిన్న కావ్యం. ఆరు పుటలలో ఉన్నదని కొందరన్నారు
కాని ఆకావ్యం మనకు దొరకడం కష్టం దొరికితే 
అందులోని పద్యాలు
ఒకటో రెండో దొరుకుతున్నవని కొందరంటారు 
మనమూ ప్రయత్నిద్దాం.

No comments: