Tuesday, January 30, 2018

పత్రికా వార్తల పద్యం


పత్రికా వార్తల పద్యం



సాహితీమిత్రులారా!




రోజూ మనం చూచే వార్తాపత్రుకల్లోని
రెండుమూడురోజుకకొకసారైనా కనిపించే
సాధారణ శీర్షికలతో చామర్తి కృష్ణమూర్తిగారు
ఒక శార్దూల పద్యం మలిచారు
ఆ పద్యం -

లారీఢీ, పదిమంది ఠా, పడవ బోల్తా, యాత్రావాసుల్ హరీ,
సారాబాబుల పట్టివేత, ఒక కబ్జాదారుపై కేసు, రా
స్తారాకో, అధికారి ఇంట ధరనా, సర్పంచి కిడ్నాపుతో
చోరీ - అంచు పత్రికా ప్రకటనల్ శోభిల్లు ముప్పొద్దులన్
                                                     (పద్యారామం, బేతవోలు రామబ్రహ్మం పుట. 82)




No comments: