Monday, September 14, 2020

క నుండి మ వరకు లేని పద్యం

 క నుండి మ వరకు లేని పద్యం





సాహితీమిత్రులారా!



కావ్యాలంకారసంగ్రహంలోని

ఈ పద్యం చూడండి-

ఇందులో క - నుండి మ- వరకు గల

25 అక్షరాలు వాడకుండా వ్రాయబడింది

దీన్ని వర్గపంచకరహితము అని అంటారు.

ఇది శబ్దచిత్రంలోని స్థానచిత్రానికి చెందినది.


హార హీర సారసారి హారశైల వాసవో

ర్వీరుహా హిహార శేషవేషహాసలాలస

శ్రీరసోరుయాశసాంశుశీల వైరివీరసం

హార సారశౌర్యసూర్య హర్యవార్యసాహసా

                                                  (కావ్యాలంకాసంగ్రహము -5- 245)


(హీరము - మణి, సారసారి - సంద్రుడు,

హారశైలము - కైలాసము, అహిహారుడు - శివుడు,

యాశసాంశుశీల - కీర్తికాంతచే ఒప్పువాడా,

సూర్యహర్యవార్య సాహసా - సూర్యుని అశ్వముల

చేతను వారింపరాని(చొరరాని) సాహసము కలవాడా)


ఈ పద్యంలో

క,ఖ,గ,ఘ,ఙ

చ,ఛ,జ,ఝ,ఞ

ట,ఠ,డ,ఢ.ణ

త,థ,ద,ధ,న

ప,ఫ,బ,భ,మ

అనే 25 అక్షరాలున్నాయేమో గమనించగలరు.

ఇవిలేవుకావుననే దీని వర్గపంచకరహిత పద్యం

అనే పేరు పెట్టారు.

3 comments:

Dr.R.P.Sharma said...

మీ బ్లాగు ఒక గొప్ప పరిశోధన గ్రంథం. మీ పరిశోధన అమోఘం.

ఏ.వి.రమణరాజు said...

శర్మగారికి ధన్యవాదాలు

mkrchowdary said...

చాలా బాగా ఉంది