Saturday, September 26, 2020

సప్తస్వరాలతో పద్యం

 సప్తస్వరాలతో పద్యం



సాహితీమిత్రులారా!



సంగీతంలో స,రి,గ,మ,ప,ద,ని -

అని 7 స్వరాక్షరాలున్నాయి కదా!

సంగీతంలో వాటికి రాగానుకూలంగా

ఈ అక్షరాలను దీర్ఘాలుగా, హ్రస్వాలుగా 

కూడా వాడుతారు సంగీతం తెలిసిన వారికి

దానిలోని ఆనందం అర్థమౌతుంది. 

కాని ఈ అక్షరాలను ఉపయోగించి

సరస్వతీ కంఠాభరణంలో ఒక శ్లోకం ఉంది

సా మమారిధమనీ నిధానినీ

సామధామ ధనిధామ సాధినీ

మానినీ సగరిమా పపాపపా

సాపగా సమసమాగమాసమా

                                        (సరస్వతీకంఠాభరణమ్- 4-265)

నదీతుల్యమైన క్షణిక సమాగమాగమము కలదియు,

సాటిలేనిదియు, నవనిధులను కలుగజేయునదియు,

కాంతికి నెలవైనదియు, ధనికులకు

తేజస్సును సంతరించునదియు, అర్చనయోగ్యయు,

గౌరవవంతురాలును, పాపరహితులను పాలించునదియు

నైన లక్ష్మిదేవి నాకు అరిధమని(శత్రుసంహారిణి)యగుగాక!

- అని భావం.

(సా = స + అ;  విష్ణువుతో కూడినది  - లక్ష్మిదేవి)

అలాగే ఈ స్వరాలను ఉపయోగించి పద్యం

వ్రాశాడొకకవి చూడండి ఆ పద్యం -

మా పని మీ పని గాదా

పాపమ మా పాపగారి పని నీ పనిగా

నీ పని దాపని పనిగద

పాపని పని మాని దాని పని గానిమ్మా


పైశ్లోకమునందు పద్యమునందు

సప్తస్వాలను మాత్రమే

ఉపయోగించి వ్రాయటం విశేషం..


No comments: