Saturday, February 8, 2020

పోకూరి కాశీపతి గారి శబ్దచిత్రం


పోకూరి కాశీపతి గారి శబ్దచిత్రం



సాహితీమిత్రులారా!
Image result for pokuri kasipathi photo
పోకూరి కాశీపతిగారి సారంగధరీయం అనే
త్య్రర్థి కావ్యంలోని శబ్దచిత్రం ఇందులో
పద్యం అంతా ఒకే ఒక స్వరం ఉపయోగించి
కూర్చిన పద్యం ఇది. ఇది ఏ - అనే ఒక స్వరంతో కూడిన పద్యం
కావున దీన్ని ఏత్వపద్యం అని అంటారు.
ఈ  ఏత్వకందంలో  ఎ,ఏ - స్వరములు ఉన్నాయి గమనించండి-
దీన్ని  ఏకస్వరచిత్రం అనీ అంటారు

కే లేదే తే తేవే
వే లేవే మెట్లె దేబెవే యేల్చేడె
న్నే లేనే వేరే యె
గ్గే లేనే లేదే యేడ్చెదేలే మేలే
                                        (సారంగధరీయము - 3-43)

కేలు = హస్తము, ఏదే = ఎచ్చటనే, తే తేవే = తెమ్ము తెమ్ము,
వే = శీఘ్రముగా, లేవేమెట్లె = లేవవేమి ఎట్లనే,
దేబెవే = దీనురాలవా, ఏల్చేడెన్ = రక్షించువనితను,
నేలేనే = నేనుండలేదా, వే = వేరుగా,
ఎగ్గేలేనేలేదె = కీడు లేక దోషం లేనేలేదె,
ఏడ్చెదేలే = ఏడ్చెదవెందులకు,
మేమే = శుభమా?

No comments: