Tuesday, February 18, 2020

చమత్కార పద్యం


చమత్కార పద్యం




సాహితీమిత్రులారా!

భాస్కరరామాయణాన్ని రచించిన
నలుగురు కవులలో ప్రధానమైనవాడు
హుళక్కి భాస్కరుడు. భాస్కరరామాయణాన్ని
కృతిగా అందుకున్నవాడు
సాహిణిమారు(డు)న.
ఈయనను గురించి హుళక్కి భాస్కరుడు చెప్పిన
చమత్కార పద్యం చూడండి-


అప్పులిడు నతడు ఘనుడా?
అప్పు డొసగి మరల పొందు నాతడు రాజా
చెప్పగవలె సాహిణి మా
రప్పను దానమున ఘనుడు, రాజు నటంచున్


అప్పు ఇచ్చేవాడు గొప్పవాడా -
అని సామాన్యంగా అర్థమౌతుంది.
అప్పులు ఇచ్చేవాడు తీర్చేవాడు కాదు ఇక్కడ.

అప్ అంటే సంస్కృతంలో నీరు -
దాన్ని తెలుగు పదంగా మార్చటం వల్ల
అప్పుగా మారింది.
ఇక్కడ అప్పులిచ్చేవాడు
ఘనుడా అంటే మేఘము

అప్పుడొసగి మరల పొందు నాతడు రాజా -
దీనిలో
రాజు అంటే భూమిని పాలించేవాడు, చంద్రుడు

ఇక భావంలోకి వస్తే

నీటిని ఇచ్చే మేఘునికంటె,
తన కళలను ఇచ్చి తిరిగి
స్వీకరించే చంద్రునికంటె
దానంలో సాహిణి మారప్పే
గొప్పవాడు - అని భావం.

No comments: