Sunday, February 23, 2020

సంభాషణలో చ్యుతచిత్రం


సంభాషణలో చ్యుతచిత్రం



సాహితీమిత్రులారా!

సరసంగా మాట్లాడుకొనే స్త్రీపురుషుల సంభాషణలో
అనేక చిత్రాలుంటాయి. ఇక్కడ మనం చ్యుతచిత్రం
చూద్దాం-
ఒక దగ్గర ఒక స్త్రీ ఒక పురుషుడు
ఇలా మాట్లాడుకొంటున్నారు.

పురుషుడు-     మాయాధుర్య చతురులేదురుగదే!
            స్త్రీ -       ఔర! యా మాట మేలగునటోయి? 
పురుషుడు-     జవరాండ్రు కుటిల ప్రచారుల్ గదే !
              స్త్రీ-    ఔర నడిమిటి మాట మానవుగదోయి! 
పురుషుడు-     జవ్వనుల్ శోక భాజనులు గదే! 
            స్త్రీ -     ఔర ! కాదొలగించి పల్క మేల్గాదటోయి?
పురుషుడు-     నన్ను నీవాని పల్కుట న్యాయమటనే?
           స్త్రీ -     మేలు వాగదచేసి నన్నేలు సామి !

పురుషుడు-     మాయాధుర్య చతురులేదురుగదే!
                         స్త్రీలు మాయచేయటంలో నిపుణులు (మాయాధుర్యలు)          
           స్త్రీ        ఔర! యా మాట మేలగునటోయి? 
                       మాయాధుర్యలో 'యా' తీసివేయమని అర్థం
                       (మాధుర్య చతురులేదురుగదే!)
   
పురుషుడు-     జవరాండ్రు కుటిల ప్రచారుల్ గదే !
                          స్త్రీలు కుటిలప్రచారులు            
                స్త్రీ-    ఔర నడిమిటి మాట మానవుగదోయి! 
                  
అపుడు మాధుర్యచతురులౌతారుగదా అదీసంగతి! అతడు న్నాడు.
(మోసం చేసటం తెలిసినవారని)
ఆమె 'టి' తీసేయమన్నది.
అప్పుడు కులప్రచారులౌతారు.
అంటే వంశోధ్ధారకులను ప్రసాదించేవారౌతారన్నమాట.(వంశంనిలబెట్టేవారు)
అతడు స్త్రీలు శోకభాజనలు అన్నాడు. అంటే దుఃఖకారకులు అని.
ఆమె 'క' తీసివేయమన్నది. అప్పుడు శోభాకారకులౌతారనియర్ధం.
"గృహిణీ గృహముచ్యతే" ఆడదిలేకపోతే ఆయింటికి అందమేలేదు. శోభాజనకలని భావం. అతడునన్ను నీవాడిని, యిలా అన్నిటికి
వ్యతిరేకంగా మాటలాడుట తగునా అన్నాడు.
ఆ 'వా' తీసేయవయ్యా! అక్కడ 'దా' చేర్చమన్నది ఆమె.
అంటే నన్ను నీదానినిగా చేసి యేలుకోవయ్యా స్వామీ! అని చెపుతోంది.

(శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి సౌజన్యముతో )

No comments: