Saturday, June 13, 2020

నాలుగు అచ్చుల పద్యం


నాలుగు అచ్చుల పద్యం






సాహితీమిత్రులారా!

పాదానికి ఒక అచ్చు చొప్పున నాలుగు పాదాలకు
నాలుగు అచ్చులతో కూర్చిన పద్యం ఇది
దండి కావ్యాదర్శం లోనిది.

అమ్నాయానా మాహాన్త్యావాగ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:
భోగోలోగో మోదో మోహోధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే
                                                              (కావ్యాదర్శమ్ -3-84)
అర్థం -
అమ్నాయానాం - వేదాలలో, అన్త్యా - చివరిదైన ఉపనిషత్తు, గీతీ: - గానములను, ఈతీ: - ఈతిబాధలుగాను,  ప్రీతీ: - దారాపుత్రాదులందు ప్రేమలను, భీతీ: - భయస్వరూపములైనట్టివిగాను, అహ - చెప్పుచున్నది. భోగ: - విషయోపభోగము, రోగ: - రోగహేతువు, మోద: - సాంసారిక సుఖానుభవము, మోహ: - అవివేకరూపమైనది, అందుచే, క్షేమే - పరమాదరహితమైన, దేశే - ఏకాంత ప్రదేశంలో, ధ్యేయేవా - ధ్యేయమగు పరమాత్మస్వరూపంనందు, ఇచ్ఛేత్ - మనసును నిలుపుటకు కోరుకొనవలెను.

అమ్నాయానా మాహాన్త్యావా
గ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:
భోగోలోగో మోదో మోహో
ధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే

మొదటిపాదంలో అకారము(అ,ఆ - అచ్చులు)
రెండవపాదంలో ఇకారము (ఇ,ఈ - అచ్చులు)
మూడవపాదంలో ఓ కారము(ఒ, ఓ - అచ్చులు)
నాలుగవపాదంలో ఏ కారము(ఎ,ఏ - అచ్చులు)
లతో కూర్చబడింది. గమనించగలరు.

No comments: