Saturday, May 26, 2018

ఈ కవికి సాటి కలరా?


ఈ కవికి సాటి కలరా?



సాహితీమిత్రులారా!



మన తెలుగువారిలో సంస్కృత కవులు అనేకులున్నారు
19వ శతాబ్దిలోని నిట్టల ఉపమాక వేంకటేశ్వరకవి కూర్చిన
చతుశ్చిత్రగర్భ - రామాయణసంగ్రహ మనే కావ్యం గురించి
ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ పేరులోనే నాలుగు
చిత్రాల గర్భిత రామాయసంగ్రహ మని వుంది.
మొదట ఈ కవిని గురించిన విషయాన్ని తెలుసుకుందాం-
ఈయన విశాఖపట్టణం మండల మందలి విజయనగర
ప్రాంతానికి చెందినవాడు. ఈయన విశ్వనాథకామాంబల
తనయుడు. రామాయణసంగ్రహము చిత్రగర్భకవితలకు
ఆలవాలం. ఇందులో రామకవచ స్తోత్రము, రామాయణ
సంగ్రహమేకాక, గౌరీకల్యాణము, శ్రీరంగాదిక్షేత్ర మాహత్మ్యము,
భగవదవతార చరిత్రము, ద్రౌపదీకల్యాణము అనే నాలుగు
కావ్యాలు ఇమిడి ఉన్నాయి.
కవివిషయం - బాలకాండలోనే ఇమిడ్చాడు ఎలాగంటే
బాలకాండలోని ప్రతిశ్లోకప్రథమాక్షరం తీసుకుంటే
రామకవచం కనబడుతుంది. అలాగే ప్రతిశ్లోకంలోని
రెండవ పాదం మొదటి అక్షరం తీసుకుంటే కవి
విషయం కనబడుతుంది.
1. గౌరీకల్యాణం - పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఇందులో గర్భితమైంది
ఎలాగంటే రామాయసంగ్రహలోని అయోధ్యకాండ మొదలు యుద్ధకాండ
వరకు గల శ్లోకముల మొదటి అక్షరాలను వరుసగా వ్రాసిన అది గౌరీ
కల్యాణమవుతుంది.

2. శ్రీరంగాది క్షేత్రమాహత్మ్యం -
13 దివ్యక్షేత్రముల మాహత్మ్యం ఇందులో ఇమిడ్చడం జరిగంది
ఎలాగంటే- అయోధ్యకాండ మొదలు యుద్ధకాండ వరకుగల
శ్లోకాల రెండవపాదం మొదటి అక్షరం తీసుకొని వరుసగా వ్రాయగా
శ్రీరంగాది క్షేత్రమాహత్మ్యం ఏర్పడుతుంది.

3. భగవదవతార చరిత్ర -
ఇది అయోధ్యకాండ మొదలు యుద్ధకాండ వరకు గల శ్లోకాల
మూడవ పాద ప్రథమాక్షరాలను తీసి వరుసగా వ్రాసిన
ఏర్పడుతుంది. ఇందులో విష్ణువు వివిధ అవతారాలను
గురించి వివరించడం జరిగింది.

4. ద్రౌపదీ కల్యాణం -
ఇది అయోధ్యకాండ మొదలు యుద్ధకాండ వరకు గల శ్లోకాల
నాలుగవ పాదం మొదటి అక్షరాలను వరుసగా కూర్చిన
ఇది ఏర్పడును.

ఇలాంటి రసనలు చేయగల కవులు ఉన్నారా!
ఆయన మోధోశక్తి ఎంత గొప్పదో సరస్వతీదేవి
కృప ఎంతగా వుందో ఊహించతరంకాదుగదా!


No comments: