Saturday, March 5, 2022

చదివితే నాలుక కదలని పద్యం

 చదివితే నాలుక కదలని పద్యం




సాహితీమిత్రులారా!



పలికినపుడు నాలుక కదలని అక్షరాలతో

పద్యం కూర్చితే అది నాలుక కదలని పద్యం

అచలజిహ్వ అంటారు. ఇక్కడ

శ్రీకోవూరి పట్టాభిరామశర్మ విరచిత

 శ్రీమదాంధ్ర మహాభాగవతం

ఏకాదశ స్కందంలోని ఈ పద్యం పలికి చూడండి-


బహుపాపౌఘ విపాకా

పహ పంఖభవాంబకా విభా భవ మోహా

వహ భూమికా భవాపహ 

బహు భంగీ భూమి భూవివాహమహేహా

                                     (1026)

దీన్ని చదివి గమనించండి.


No comments: