చదివితే నాలుక కదలని పద్యం
సాహితీమిత్రులారా!
పలికినపుడు నాలుక కదలని అక్షరాలతో
పద్యం కూర్చితే అది నాలుక కదలని పద్యం
అచలజిహ్వ అంటారు. ఇక్కడ
శ్రీకోవూరి పట్టాభిరామశర్మ విరచిత
శ్రీమదాంధ్ర మహాభాగవతం
ఏకాదశ స్కందంలోని ఈ పద్యం పలికి చూడండి-
బహుపాపౌఘ విపాకా
పహ పంఖభవాంబకా విభా భవ మోహా
వహ భూమికా భవాపహ
బహు భంగీ భూమి భూవివాహమహేహా
(1026)
దీన్ని చదివి గమనించండి.
No comments:
Post a Comment