Saturday, April 24, 2021

ప్రయాణం ఎందుకు ఆపుకున్నానంటే...........

 ప్రయాణం ఎందుకు ఆపుకున్నానంటే...........




సాహితీమిత్రులారా!



నాయకుడు దూరదేశ ప్రయాణానికి

పయనమై ఉండి నిలిచిపోయాడు దానికి

ఒక మిత్రుడు "చెలికాడా! ప్రయాణం

ఏల నిలుపుకున్నావు" అని ప్రశ్నించాడు

దానికి ఆ నాయకుడు చెప్పిన బదులు ఈ శ్లోకం -


శీతే శీతకరో2మ్బుజే కువలయద్వన్ద్వాద్వినిర్గచ్ఛతి

స్వచ్ఛా మౌక్తికసంహతిర్ధవళిమాహైమీం లతామఞ్చితి,

స్పర్శాత్ పఙ్కజకోశయోరభినవాయాన్తిస్రజ:క్లాన్తతా

మేషోత్పాతపరమ్పరా మమ సఖే, యాత్రాస్పృహాంకృన్తతి

                                                           (పంచబాణవిలాసం లోనిది)


ఆకాశంలోని చంద్రుడు నేలమీది కమలంనందు పడుకొన్నాడు,

ముత్యాలు నల్లకలువల్లో పట్టినవి, బంగారుతీగ స్వభావసిద్ధమైన

పసుపు రంగును వదలి తెల్లబడింది, అప్పుడే గుచ్చిన పువ్వుల సరాలు

తామరమొగ్గలు తగలడంతో వాడిపోయాయి ఇలాంటి దుశ్శకునాలు

కనిపించడం వల్ల మంచిది కాదనిఅంటారు

ఇన్ని ఉత్పాతాలు ఒక్కసారే రావడం చేత

ప్రయాణం ఆపుకొన్నాను - అని

చెప్పాడట.

ఇది పైకి కనిపించే అర్థం.


నిజమైన అర్థం -

ఆకాశంలోని చంద్రుడు నేలమీది కమలంలో పడుకున్నాడు

అంటే నా ప్రియురాలు నా వియోగం ఓర్చుకోలేక తనకమలాల్లాంటి

చేతుల్లో చంద్రునివంటి ముఖాన్ని పెట్టుకున్నది అని అర్థం.

ముత్యాలు నల్లకలువల్లో పుట్టాయి అంటే నల్లకలువల్లాంటి

రెండు కళ్ళనుండి ముత్యాల్లాంటి కన్నీరు వచ్చిందని

అంటే తన భార్య కంటికి కాటుకైనా పెట్టుకోనందున స్వచ్ఛమైన

ముత్యాల్లాంటి కన్నీరు కార్చిందని అర్థం.

బంగారు తీగలాంటి ఆమే శరీరపు రంగు

విరహతాపంచేత తెల్లబడింది అని అర్థం.

తామరమొగ్గల్లాంటి స్తనాలకు తగిలి వేసుకున్న

పూలదండలు వాడిపోయాయని

అంతటి విరహతాపం ఉందని అర్థం.

ఇన్ని అవస్థలు చూచినా ప్రయాణం

మంచిదికాదని మానుకున్నాను అని చెప్పాడు.

No comments: