Monday, March 1, 2021

ఐ-త్వంతో పద్యం

 ఐ-త్వంతో పద్యం





సాహితీమిత్రులారా!



ఒక శ్లోకం లేదా పద్యంలో ఒకేఒక స్వరం(అచ్చు)వాడితే

అది ఏకస్వరచిత్రం దానిలో కేవలం దీర్ఘస్వరాలనే వాడితే

అది దీర్ఘ ఏకస్వరచిత్రం అవుతుంది.

ఈ శ్లోకం చూడండి.

వైధై రైనై రైశై రైంద్రై రైజై రైలై ర్జైనై: సైద్ధై:

మైత్రై ర్నైకై ర్దై ర్యై ర్వై రై దై: స్వై: స్వైరై ర్దేవైస్తైస్తై:

                                                                                       (సరస్వతీకంఠాభరణము)

దీనిలో అంతటా "ఐ" -త్వమే ఉపయోగించి

శ్లోకం కూర్చడమైనది.

కావున దీన్ని

"ఐ" - త్వ శ్లోకం అనికూడా పిలువవచ్చు.

అర్థం - బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇంద్రుడు, మన్మథుడు, భూమి,

జినుడు, సిద్ధులు, సూర్యుడు కుబేరుడు అనువారికి సంబంధించిన

వారిచేత, అనేక దేవతల చేతను సుష్టుగా ఒసగబడిన

వారివారి ధైర్యములచేత సమగ్రముగా సమృద్ధి నొందుదును.

No comments: