Friday, January 31, 2020

అపభ్రంశం(భాష)లోని పద్యాలు


అపభ్రంశం(భాష)లోని పద్యాలు




సాహితీమిత్రులారా!

సంస్కృతం నుంచి వికృతం, భ్రష్టం అయిన శబ్దాలే అపభ్రంశాలు.
అపభ్రంశం విక్రమశకం 6వ శతాబ్దినుంచి 10వ శతాబ్దివరకు 
వికసించిందని భావిస్తున్నారు. ఇది బీహారు, గుజరాత్, వంగ ప్రాంతాల్లో
బాగా పెంపొందింది. 

ఇక్కడ రెండు పద్యాలను గమనిద్దాం.

1. శరహస్తపాదుడు(సరహపా) వ్రాసిన పద్యం(చర్య)

పండిఅ సఅల సత్థ బక్ఖాణ ఇ
దేహహి బుద్ధ బసంత ణ జాణ ఇ
గమణా గమణ ణ తేణ బిఖండిఅ
తోచి ణిలజ్జ భణఇ హ ఉరి, పండి అ

దీని భావం -
పండితుడు సకల శాస్త్రాలను వ్యాఖ్యానిస్తాడు
కాని తన శరీరంలో ఉండే ఆత్మను ఎరుగలేడు.
జనన మరణ పరిభ్రమణం నుంచి తప్పించుకోలేడు.
అయినప్పటికి సిగ్గు లేకుండా నేను పండితుణ్ణని ఘోషిస్తాడు

2. మంజుని రచనగా చెప్పబడే ప్రబంధచింతామణిలోని దోహా ఉదాహరణకు-

మంజ భణఇ మణాలవఇ జువ్వణ గయుం ణ ఝూరి
జయి సక్కరఖండ మియతో ఇ సమీదీ చూరి

మంజుడు అంటున్నాడు - హే! మృణాలవతి! చేజారిన యౌవనం
గురించి చింతించకు. చక్కెర మరింత పొడిపొడి అయినా
తియ్యదనం ఎక్కడికి పోతుంది?

మంజుని ఈ భావంతో ఏకీభవించని రసికుడు ఉండడు కదా!

ఇదీ మిత్రులారా అప్రభ్రంశం గురించిన కొంత విషయం.

No comments: