Tuesday, February 28, 2023

రామసేతువు

 రామసేతువు





సాహితీమిత్రులారా!



రామసేతు. ఆనాడు రాముడు, అతని వానరసైన్యం శ్రీలంకకు నిర్మించిన రాతివంతెన. సీతమ్మ కోసం రావణుడిపై యుద్ధం చేసాడు, రాముడు. ఇప్పటి ధనుష్కోటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడి నుంచి సముద్రమార్గంలో అతి దగ్గరలో ఉన్న లంక భూభాగంలోకి వెళ్లాలి. అప్పుడే వానర వీరుల్లో ఒకరు, నిర్మాణ శాస్త్రంలో ఆరితేరిన నలుడు వారధి కట్టాడు. నలుడి ఆధ్వర్యంలో నీటిలో తేలే రాళ్లతో వంతెనకట్టారు, వానర వీరులు. రామసేతు లేకపోతే లంకపై యుద్ధమే లేదు. ఆ సేతువు వల్లే రామ రావణ యుద్ధం జరిగింది. రావణ సంహారం జరిగింది. సీతారాములు కలిశారు. ఇప్పటికీ రామేశ్వరం దగ్గరలో ఉన్న ధనుష్కోటికి వెళితే, రామసేతు ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆనాడు సముద్రుడని శాంతించాలని రాముడు కోరాడు. ఇప్పటికీ ఆ శాంతి సముద్రం మనకు కనిపిస్తుంది. రామసేతు వైపు ఉన్న సముద్రంలో అసలు అలలే రావు. పక్కనే ఉన్న బంగాళాఖాతం మాత్రం ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అసలు, రామసేతు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుగైదు ఏళ్ల క్రితమే నాసా డిస్కవరీ ఛానల్ పరిశోధకులు రామసేతు మీద రీసెర్చ్ చేశారు. ఆ సేతు సహజసిద్ధంగా ఏర్పడినది కాదు, మనుషులు కట్టినదే అని వారు తేల్చారు. సేతువు ఉన్నచోట ఉన్న రాళ్లు ఏడు వేల కిందటివి అని చెప్పారు.. ఇవి డిస్కవరీ ఛానల్ చెప్పిన వివరాలు. ఇన్నాళ్లు ఆ వారధి మనుషులు కట్టినది అని కొందరు వాదించేవారు. కానీ, వాల్మీకి రామాయణంలో ఆ వారధి ఎలా కట్టారు, ఏ రాళ్లు వాడారు అన్న వివరాలన్నీ ఉన్నాయి. సైంటిస్టుల పరిశోధనలతో వాల్మీకిరామాయణంలో రామసేతు గురించి రాసిన ప్రతి అక్షరం నిజంగా జరిగినదేనని ఋజువయింది. తన లీలలకు సాక్ష్యాలుగా భగవంతుడు ఈ భూమి మీద కొన్ని రుజువులు వదిలే వెళ్తాడు. రామాయణం జరిగిందే అనడానికి రామసేతు ప్రత్యక్ష సాక్ష్యం. శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పేందుకు ఇప్పటికీ ద్వారక సముద్రంలో మునిగి ఉన్న ద్వారక సాక్ష్యం. భారతదేశంలో ఎక్కడ వరకు అంటే, పూర్వకాలంలో పెద్దలు, ఆ సేతు హిమాచలం అని చెప్పేవారు. ఇందులో, సేతువు అంటే రామసేతువు, హిమాచలం అంటే హిమాలయాలు అని అర్థం. త్రేతాయుగంలో జరిగిన రామకథను వాల్మీకి రామాయణంగా వర్ణించారు. సీతను అపహరించిన రావణుని వధించి ఆమెను సురక్షితంగా తీసుకురావడానికి లంకకు వెళ్లాలి. ఆ లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. అలా దాటడానికి ఉన్న అన్ని అవకాశాలపై చర్చ జరిగాక, సముద్రంపై వంతెన కట్టాలని అనుకుంటాడు, రాముడు. విశ్వకర్మ అంశతో పుట్టిన నలుని సహాయంతో సముద్ర జలాలపై తెలియాడే ఒక వంతెనను నిర్మించాడు. లక్షల మంది వానరుల సహాయంతో కట్టిన వారధి, అది. అలా కట్టిన వారిని ఆ తర్వాత తరాలు కూడా భారత శ్రీలంకల రాకపోకలకు ఉపయోగించాయి. శ్రీలంకలో బౌద్ధ వ్యాప్తికి బౌద్ధభిక్షువులు ఈ వంతెనను ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి.

 విభీషణుడు కాలం నుంచి భారత శ్రీలంకల మధ్య ఉన్న స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికి రాముడే పునాది వేశాడు ఆ తర్వాత సముద్రమట్టాలు పెరిగి ఆ వంతెన క్రమంగా మునిగిపోయింది. విదేశీ పాలకుల సమయంలో ఆ వంతెనకు ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు.  బ్రిటిష్ చరిత్రకారులు మహా మేధావులు అని మన దేశంలో ఉన్న మన ఎంతోమంది చరిత్రకారుల నమ్మకం కదా. అసలు వంతెనే లేకపోతే ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరు ఎందుకు పెట్టాలి? అనే ఆలోచన మన హిస్టారియన్లకు ఎందుకు రాలేదో! రామసేతు అనే ఐడెంటిటీ  చెడిపోవడానికి ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు, విదేశీ పాలకులు. కానీ, తరతరాలుగా రాముడు వేసిన దారిలో నడుస్తున్న భారతీయుల నోటి నుంచి ఏనాడూ ఆడమ్స్ బ్రిడ్జ్ అనే మాట రాలేదు. ఇప్పటికి, ఎప్పటికీ ఆ వంతెన రామసేతు గానే మనసులో నిలిచిపోయింది, నిలిచిపోతుంది కూడా.

 నీటిలో మునిగిపోయి ఉన్న ఆ రాతి వంతెన ప్రస్తావన భారత పురాణాల, ఇతిహాసాల గ్రఃథాల్లో ఉంది. క్రీస్తుశకం 1480 వరకు ఆ వంతెనను అప్పటి తరాలు వాడుకున్నాయి ఆ తరువాత తుఫానులో సముద్ర అలలకు ఆ వంతెన దెబ్బతింది. సముద్రం క్రమక్రమంగా పెరిగింది. వంతెన నీటిలో మునిగింది. సునామీ లాంటి పెద్ద పెద్ద విపత్తులను ఆ సేతువు ఇప్పటికీ ఆపుతుంది. ఆ మధ్య సునామీ వచ్చి చెన్నై నష్టపోయింది. ధనుష్కోటి ప్రక్కన ఉన్న పల్లెలు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. కారణం, రామసేతువు.  అలాంటి సేతువును తొలగించి భారతదేశ నౌకాయాన మార్గం చేద్దామని అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. సేతుసముద్రం అనే ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేశాయి. కానీ, ఆ వంతెననించి ఒక రాయిని కూడా కదపలేకపోయారు. పెద్ద పెద్ద క్రేన్ లు కూడా విరిగిపోయాయి. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు కూడా మూలన పడింది 

రామాయణం ప్రకారం త్రేతాయుగంలో ఈ రామసేతు నిర్మాణం జరిగింది. రామసేతు నిర్మాణ కాలం ఇప్పటికీ సరిగ్గా తెలియదు. తమిళనాడులో రామేశ్వరం కన్నా ముందు వచ్చే రైలుస్టేషన్ పంబన్ దీవి.  అక్కడినుంచి శ్రీలంకలోని మన్నారుదీవి వరకు ఈ వంతెన ప్రస్తుతం కనిపిస్తోంది. విచిత్రమేమంటే, పాక్ జల సంధి, మన్నారు జలసంధులను ఈ రామసేతు విడదీస్తుంది. విచిత్రం ఏమంటే, ఈ రామసేతు ఉన్న ప్రాంతం అంతా సముద్రమట్టం మూడు నుంచి 30 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే అదే లోతు ఉండడం ఆశ్చర్యం.

 దీని వెనుక రామాయణంలోనే కథ ఉంది రాముడు ఈ సేతును నిర్మించేటప్పుడు సముద్రుడు ఉగ్రరూపంలో ఉన్నాడు. సేతువును నిర్మించేందుకు అనువుగా సముద్రుడు శాంతించాలని రాముడు కోరాడు. కానీ సముద్రుడు స్పందించలేదు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువపెడితే, సముద్రుడు భయపడి శాంతించాడని రామాయణంలో కథ. ఇప్పటికీ రామసేతు ఉన్న ప్రాంతంలో ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు బంగాళాఖాతం ఉంటాయి. ఆ రెండు సముద్రాల అద్భుత సంగమాన్ని ధనుష్కోట్లో చూడవచ్చు. ఒకవైపు సముద్రం ఎటువంటి అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటే, మరోవైపు సముద్రం ఊరిని మింగేస్తుందా! అన్నట్టు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ధనుష్కోట్లో ఇప్పటికీ కనిపించే వింత అది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ రామసేతు 50 కిలోమీటర్ల పొడవు ఉంది. ధనుష్కోటి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న శ్రీలంకకు సముద్రపు దారి 50 కిలోమీటర్లు మాత్రమే. పడవల్లో ప్రయాణిస్తే, రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు ఆ దారిలో ఒకటి రెండు చోట్ల ఇప్పటికీ రామసేతు పైకి కనిపిస్తుందని అంటారు. ఈ వంతెన కోసం వాడిన రాళ్లు నీటిపై తేలుతూ ఉంటాయి. ఆ రాళ్ల అవశేషాలను ఇప్పటికీ ధనుష్కోటి ఒడ్డున చూడొచ్చు. రెండు చేతులతో ఎత్తడానికి వీల్లేనంతగా ఆ రాళ్లు బరువుగా ఉంటాయి. కానీ, నీటిలో వేస్తే మాత్రం, తేలుతూ ఉంటాయి  ఆ రాళ్లలో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ వల్లే ఇలా జరిగినా, అలాంటి రాళ్ళను ఆ కాలంలో ఎలా కనిపెట్టారు అన్నది ఆశ్చర్యం. రామాయణంలో కూడా రామసేతుకు వాడిన రాళ్లు తేలుతాయని వాల్మీకి వర్ణించారు. నలుడు ఆ రాళ్ళను ఎంపిక చేశారు అని కూడా చెప్పారు. రామేశ్వరం, ధనుష్కోట్లో ఎక్కడపడితే అక్కడ ఈ రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ రాళ్ళను నీటిపై తేల్చి, మనకి అక్కడ ప్రజలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దొరుకుతున్న రాళ్లు మూడు నుంచి ఐదు కేజీల బరువు ఉంటున్నాయి. కానీ, రామాయణంలో వర్ణన చూస్తే ఆ కాలంలో పర్వతాల లాంటి రాళ్లను కూడా వాడినట్టు వివరణ ఉంది .

15వ శతాబ్దం వరకు రామసేతుని ప్రజలు వాడుకున్నారు. శ్రీలంకకు వెళ్లేందుకు అప్పటి వ్యాపారులకు ప్రధాన రహదారి ఈ వంతెనే. ఆ తర్వాత సముద్రాల్లో మార్పు వచ్చి, దారి నీటిలో కలిసిపోయింది. 1480లో వచ్చిన భారీ తుఫానుల వల్ల రామసేతు డ్యామేజ్ అయిందని రామేశ్వరంలో ఉన్న రామన్ కోవెల శాసనాలు చెప్తున్నాయి. ఈ సేతుకు ఉపయోగించిన రాళ్లు అగ్నిపర్వతాలు పేలినపుడు ఏర్పడిన రాళ్లు, లేదా, లైమ్ స్టోన్ అని సైంటిస్టులు నిర్ధారించారు. కానీ, అలాంటి రాళ్లు ఒక ధనుష్కోటి ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యం. మొత్తానికి ఈ వంతెన ఏడువేల ఏళ్ళకు ముందు నుంచే ఉందని స్పష్టమైన ఆధారాలు లభించాయి. కార్బన్ డేటింగ్, ఇతర పరీక్షల్లో రామసేతు రామాయణం కాలం నాటిదే అని సైంటిస్టులు తేల్చారు. 1960లో నాసా ఒక సాటిలైట్ పిక్చర్ ని తీసింది. ధనుష్కోటి నుంచి శ్రీలంక మధ్య ఉన్న ఈ వారధి ఫోటో స్పష్టంగా కనిపించింది. ఈ వంతెనతో కూడిన శ్రీలంక ఒక కన్నీటి బిందువులా ఉందని కూడా నాసా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2000వ  సంవత్సరంలో ఎన్డీవర్ షటిల్ రాడార్ మిషన్ లో భాగంగా తీసిన సాటిలైట్ ఫోటోలలో రామసేతు మరింత స్పష్టంగా కనిపించింది

 రామసేతు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. సముద్ర అలల తాకిడి, సునామీ వంటి ప్రమాదాల నుంచి దేశాన్ని, తీర ప్రాంతాన్ని తీరంలో ఖనిజ ప్రకృతి వనరులను ఆ సేతువు రక్షిస్తోంది. ప్రపంచంలో యురేనియంకి దీటుగా పనికొచ్చే అత్యంత విలువైన థోరియం నిలువలు అపారంగా ఉన్న మన సముద్ర తీరాన్ని ఇది కాపాడుతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే థోరియంలో 30% ఇక్కడే దొరుకుతుంది. అబ్దుల్ కలాంవంటివారు విద్యుత్ ఉత్పత్తికి యురేనియం బదులు థోరియం వాడాలనే సూచనలను చేసేవారు. 

2017లో రామసేతుపై డిస్కవరీ సైన్స్ ఛానల్ లో వచ్చిన డాక్యుమెంటరీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారత శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు మానవ నిర్మితమేనని ఆ ఛానల్ రుజువు చేసింది. అలాగే, భారతీయదాసన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్ ప్రొఫెసర్ ఎస్ఎం రామస్వామి నేతృత్వంలో 2003లో ఒక బృందం రామసేతుపై పరిశోధనలు చేసింది. రామనాథపురం పంబన్ లలో సేతువుపై వీరు పరిశోధనలు చేశారు. ఇక్కడ బీచ్ లో భూమి, సముద్రపు సుదీర్ఘ అలల తాకిడి వల్ల ఏర్పడ్డాయని, కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా ఇక్కడ తీరప్రాంతాల వయస్సు రామాయణ కాలంతో సరిపోతుందని వారు తేల్చారు .కోరల్ వేవ్ స్  బదులుగా ఉండే ఇసుక మధ్య ఇలాంటి వంతెనలు సహజంగా ఏర్పడడం సాధ్యం కాదని కూడా వారు చెప్పారు.

 మరి రామాయణంలో ఈ సేతు గురించి ఏముంది ? వానరవీరులలో ప్రముఖుడైన నలుడు విశ్వకర్మ కుమారుడు "నాపై సేతువు అని అతడే నిర్మించగలడు."ఆ సేతువుని నేను భరించగలను" అని సముద్రుడు రాముడికి చెప్పినట్టు రామాయణంలో శ్లోకాలు ఉంటాయి. సేతు నిర్మాణ కౌశలం నాకు తెలుసని, మన వానరసేనతో ఆ కార్యాన్ని నెరవేరుస్తానని అన్నాడు, నలుడు. శ్రీరాముడు సేతునిర్మాణనికి ఆజ్ఞాపిస్తే లక్షల మంది వానరవీరులు మహావృక్షాలను, పెద్దపెద్ద పొదళ్లను తీసుకొచ్చి, సముద్ర తీరానికి తెచ్చారు. ఏనుగులంత ఎత్తున బండరాళ్లను పర్వతాలను పెకలించి, యంత్ర సాయంతో సముద్రతీరానికి చేర్చారు,  వానరులు. యంత్రం గురించి రామాయణంలో ఉంది. ఆ యంత్రం ఏంటో తెలియదు. నలుడు సముద్రంపై సేతు నిర్మాణం ప్రారంభించాడు. వానరులు అంతా సహకరిస్తున్నారు. కొందరు పర్వతాలను తీసుకువచ్చారు. ఇంకొందరు దారికి అటు ఇటు కర్రలు పాతి వాటిని వరుస క్రమంలో గడ్డి పోచలను పెనవేసి కడుతున్నారు. ఏ రోజు ఎంత ఎంత దూరం కట్టారో కూడా, రామాయణంలో ఉంది. ఐదు రోజుల్లో ఈ వంతెన నిర్మాణాన్ని ముగించారు. వానరులు. ఆరో రోజు సముద్రానికి అవతల ఉన్న లంకలో సువేల పర్వతానికి చేరుకున్నారని వాల్మీకి రామాయణం యుద్ధకాండలో 69 నుంచి 73 వరకు ఉన్న సర్గలు చెబుతున్నాయి. ఇలా రామాయణంలో విశ్వకర్మ అంశతో పుట్టిన నలుడు రామసేతును నిర్మించాడని యుద్ధకాండలో స్పష్టంగా ఉంది. ఈ సేతువు 10 యోజనాలు వెడల్పు, 100 యోజనాలు దూరం ఉందని రామాయణం చెప్తుంది. యోజనం అంటే సుమారు ఎనిమిది మైళ్ళు ఆ లెక్కన ఎనిమిది వందల మైళ్ల దూరం ఈ సేతువును నిర్మించారని రామాయణం చెప్తుంది. ఇప్పుడు మనకు ఆధారాలుగా కనిపిస్తున్న రామసేతు 50 కిలోమీటర్లు. ఆ లెక్కన, మనం ఇప్పుడు చూస్తున్నది అసలు శ్రీలంకలో ఒక భాగం మాత్రమేనా? అసలు లంక సముద్రంలో మునిగిందా? అన్నది కూడా పరిశోధించాలి. పురాణాల్లో చెప్పిన లంకలో కొన్ని ఆనవాళ్లు మాత్రమే ఇప్పుడు శ్రీలంకలో కనిపిస్తున్నాయి. ద్వారకలాగే అసలు లంక కూడా సముద్రంలో మునిగిందా? మునిగితే, ఎక్కడుంది? అన్నది పరిశోధించాలి. అలా లక్షల సంఖ్యలో వానరులు రామసేతుని నిర్మించారు. ఇంకా ఎన్నో మిస్టరీలు రామసేతులాగే సముద్రంలో మునిగిపోయాయి. మన భారతదేశ చరిత్రకు మూలమైన రెండు ప్రధాన సాక్ష్యాలు సముద్రంలో కలిసిపోయాయి. ఒకటి, తేతాయుగం నాటి రామసేతు. ఇంకొకటి, ద్వాపరయగంలోని శ్రీకృష్ణుడు నడిచిన నేల ద్వారక. ఈ రెండిటిని లోతుగా అధ్యయనం చేస్తే, ఇప్పుడున్న చరిత్ర పుస్తకాలను అన్నిటిని మార్చాల్సి వస్తుంది.రామసేతువు

రామసేతు. ఆనాడు రాముడు, అతని వానరసైన్యం శ్రీలంకకు నిర్మించిన రాతివంతెన. సీతమ్మ కోసం రావణుడిపై యుద్ధం చేసాడు, రాముడు. ఇప్పటి ధనుష్కోటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడి నుంచి సముద్రమార్గంలో అతి దగ్గరలో ఉన్న లంక భూభాగంలోకి వెళ్లాలి. అప్పుడే వానర వీరుల్లో ఒకరు, నిర్మాణ శాస్త్రంలో ఆరితేరిన నలుడు వారధి కట్టాడు. నలుడి ఆధ్వర్యంలో నీటిలో తేలే రాళ్లతో వంతెనకట్టారు, వానర వీరులు. రామసేతు లేకపోతే లంకపై యుద్ధమే లేదు. ఆ సేతువు వల్లే రామ రావణ యుద్ధం జరిగింది. రావణ సంహారం జరిగింది. సీతారాములు కలిశారు. ఇప్పటికీ రామేశ్వరం దగ్గరలో ఉన్న ధనుష్కోటికి వెళితే, రామసేతు ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆనాడు సముద్రుడని శాంతించాలని రాముడు కోరాడు. ఇప్పటికీ ఆ శాంతి సముద్రం మనకు కనిపిస్తుంది. రామసేతు వైపు ఉన్న సముద్రంలో అసలు అలలే రావు. పక్కనే ఉన్న బంగాళాఖాతం మాత్రం ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అసలు, రామసేతు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుగైదు ఏళ్ల క్రితమే నాసా డిస్కవరీ ఛానల్ పరిశోధకులు రామసేతు మీద రీసెర్చ్ చేశారు. ఆ సేతు సహజసిద్ధంగా ఏర్పడినది కాదు, మనుషులు కట్టినదే అని వారు తేల్చారు. సేతువు ఉన్నచోట ఉన్న రాళ్లు ఏడు వేల కిందటివి అని చెప్పారు.. ఇవి డిస్కవరీ ఛానల్ చెప్పిన వివరాలు. ఇన్నాళ్లు ఆ వారధి మనుషులు కట్టినది అని కొందరు వాదించేవారు. కానీ, వాల్మీకి రామాయణంలో ఆ వారధి ఎలా కట్టారు, ఏ రాళ్లు వాడారు అన్న వివరాలన్నీ ఉన్నాయి. సైంటిస్టుల పరిశోధనలతో వాల్మీకిరామాయణంలో రామసేతు గురించి రాసిన ప్రతి అక్షరం నిజంగా జరిగినదేనని ఋజువయింది. తన లీలలకు సాక్ష్యాలుగా భగవంతుడు ఈ భూమి మీద కొన్ని రుజువులు వదిలే వెళ్తాడు. రామాయణం జరిగిందే అనడానికి రామసేతు ప్రత్యక్ష సాక్ష్యం. శ్రీకృష్ణుడు ఉన్నాడు అని చెప్పేందుకు ఇప్పటికీ ద్వారక సముద్రంలో మునిగి ఉన్న ద్వారక సాక్ష్యం. భారతదేశంలో ఎక్కడ వరకు అంటే, పూర్వకాలంలో పెద్దలు, ఆ సేతు హిమాచలం అని చెప్పేవారు. ఇందులో, సేతువు అంటే రామసేతువు, హిమాచలం అంటే హిమాలయాలు అని అర్థం. త్రేతాయుగంలో జరిగిన రామకథను వాల్మీకి రామాయణంగా వర్ణించారు. సీతను అపహరించిన రావణుని వధించి ఆమెను సురక్షితంగా తీసుకురావడానికి లంకకు వెళ్లాలి. ఆ లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. అలా దాటడానికి ఉన్న అన్ని అవకాశాలపై చర్చ జరిగాక, సముద్రంపై వంతెన కట్టాలని అనుకుంటాడు, రాముడు. విశ్వకర్మ అంశతో పుట్టిన నలుని సహాయంతో సముద్ర జలాలపై తెలియాడే ఒక వంతెనను నిర్మించాడు. లక్షల మంది వానరుల సహాయంతో కట్టిన వారధి, అది. అలా కట్టిన వారిని ఆ తర్వాత తరాలు కూడా భారత శ్రీలంకల రాకపోకలకు ఉపయోగించాయి. శ్రీలంకలో బౌద్ధ వ్యాప్తికి బౌద్ధభిక్షువులు ఈ వంతెనను ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి.

 విభీషణుడు కాలం నుంచి భారత శ్రీలంకల మధ్య ఉన్న స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికి రాముడే పునాది వేశాడు ఆ తర్వాత సముద్రమట్టాలు పెరిగి ఆ వంతెన క్రమంగా మునిగిపోయింది. విదేశీ పాలకుల సమయంలో ఆ వంతెనకు ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు.  బ్రిటిష్ చరిత్రకారులు మహా మేధావులు అని మన దేశంలో ఉన్న మన ఎంతోమంది చరిత్రకారుల నమ్మకం కదా. అసలు వంతెనే లేకపోతే ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరు ఎందుకు పెట్టాలి? అనే ఆలోచన మన హిస్టారియన్లకు ఎందుకు రాలేదో! రామసేతు అనే ఐడెంటిటీ  చెడిపోవడానికి ఆడమ్స్ బ్రిడ్జి అని పేరు పెట్టారు, విదేశీ పాలకులు. కానీ, తరతరాలుగా రాముడు వేసిన దారిలో నడుస్తున్న భారతీయుల నోటి నుంచి ఏనాడూ ఆడమ్స్ బ్రిడ్జ్ అనే మాట రాలేదు. ఇప్పటికి, ఎప్పటికీ ఆ వంతెన రామసేతు గానే మనసులో నిలిచిపోయింది, నిలిచిపోతుంది కూడా.

 నీటిలో మునిగిపోయి ఉన్న ఆ రాతి వంతెన ప్రస్తావన భారత పురాణాల, ఇతిహాసాల గ్రఃథాల్లో ఉంది. క్రీస్తుశకం 1480 వరకు ఆ వంతెనను అప్పటి తరాలు వాడుకున్నాయి ఆ తరువాత తుఫానులో సముద్ర అలలకు ఆ వంతెన దెబ్బతింది. సముద్రం క్రమక్రమంగా పెరిగింది. వంతెన నీటిలో మునిగింది. సునామీ లాంటి పెద్ద పెద్ద విపత్తులను ఆ సేతువు ఇప్పటికీ ఆపుతుంది. ఆ మధ్య సునామీ వచ్చి చెన్నై నష్టపోయింది. ధనుష్కోటి ప్రక్కన ఉన్న పల్లెలు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. కారణం, రామసేతువు.  అలాంటి సేతువును తొలగించి భారతదేశ నౌకాయాన మార్గం చేద్దామని అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. సేతుసముద్రం అనే ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేశాయి. కానీ, ఆ వంతెననించి ఒక రాయిని కూడా కదపలేకపోయారు. పెద్ద పెద్ద క్రేన్ లు కూడా విరిగిపోయాయి. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు కూడా మూలన పడింది 

రామాయణం ప్రకారం త్రేతాయుగంలో ఈ రామసేతు నిర్మాణం జరిగింది. రామసేతు నిర్మాణ కాలం ఇప్పటికీ సరిగ్గా తెలియదు. తమిళనాడులో రామేశ్వరం కన్నా ముందు వచ్చే రైలుస్టేషన్ పంబన్ దీవి.  అక్కడినుంచి శ్రీలంకలోని మన్నారుదీవి వరకు ఈ వంతెన ప్రస్తుతం కనిపిస్తోంది. విచిత్రమేమంటే, పాక్ జల సంధి, మన్నారు జలసంధులను ఈ రామసేతు విడదీస్తుంది. విచిత్రం ఏమంటే, ఈ రామసేతు ఉన్న ప్రాంతం అంతా సముద్రమట్టం మూడు నుంచి 30 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే అదే లోతు ఉండడం ఆశ్చర్యం.

 దీని వెనుక రామాయణంలోనే కథ ఉంది రాముడు ఈ సేతును నిర్మించేటప్పుడు సముద్రుడు ఉగ్రరూపంలో ఉన్నాడు. సేతువును నిర్మించేందుకు అనువుగా సముద్రుడు శాంతించాలని రాముడు కోరాడు. కానీ సముద్రుడు స్పందించలేదు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువపెడితే, సముద్రుడు భయపడి శాంతించాడని రామాయణంలో కథ. ఇప్పటికీ రామసేతు ఉన్న ప్రాంతంలో ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు బంగాళాఖాతం ఉంటాయి. ఆ రెండు సముద్రాల అద్భుత సంగమాన్ని ధనుష్కోట్లో చూడవచ్చు. ఒకవైపు సముద్రం ఎటువంటి అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటే, మరోవైపు సముద్రం ఊరిని మింగేస్తుందా! అన్నట్టు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ధనుష్కోట్లో ఇప్పటికీ కనిపించే వింత అది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ రామసేతు 50 కిలోమీటర్ల పొడవు ఉంది. ధనుష్కోటి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న శ్రీలంకకు సముద్రపు దారి 50 కిలోమీటర్లు మాత్రమే. పడవల్లో ప్రయాణిస్తే, రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు ఆ దారిలో ఒకటి రెండు చోట్ల ఇప్పటికీ రామసేతు పైకి కనిపిస్తుందని అంటారు. ఈ వంతెన కోసం వాడిన రాళ్లు నీటిపై తేలుతూ ఉంటాయి. ఆ రాళ్ల అవశేషాలను ఇప్పటికీ ధనుష్కోటి ఒడ్డున చూడొచ్చు. రెండు చేతులతో ఎత్తడానికి వీల్లేనంతగా ఆ రాళ్లు బరువుగా ఉంటాయి. కానీ, నీటిలో వేస్తే మాత్రం, తేలుతూ ఉంటాయి  ఆ రాళ్లలో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ వల్లే ఇలా జరిగినా, అలాంటి రాళ్ళను ఆ కాలంలో ఎలా కనిపెట్టారు అన్నది ఆశ్చర్యం. రామాయణంలో కూడా రామసేతుకు వాడిన రాళ్లు తేలుతాయని వాల్మీకి వర్ణించారు. నలుడు ఆ రాళ్ళను ఎంపిక చేశారు అని కూడా చెప్పారు. రామేశ్వరం, ధనుష్కోట్లో ఎక్కడపడితే అక్కడ ఈ రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ రాళ్ళను నీటిపై తేల్చి, మనకి అక్కడ ప్రజలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దొరుకుతున్న రాళ్లు మూడు నుంచి ఐదు కేజీల బరువు ఉంటున్నాయి. కానీ, రామాయణంలో వర్ణన చూస్తే ఆ కాలంలో పర్వతాల లాంటి రాళ్లను కూడా వాడినట్టు వివరణ ఉంది .

15వ శతాబ్దం వరకు రామసేతుని ప్రజలు వాడుకున్నారు. శ్రీలంకకు వెళ్లేందుకు అప్పటి వ్యాపారులకు ప్రధాన రహదారి ఈ వంతెనే. ఆ తర్వాత సముద్రాల్లో మార్పు వచ్చి, దారి నీటిలో కలిసిపోయింది. 1480లో వచ్చిన భారీ తుఫానుల వల్ల రామసేతు డ్యామేజ్ అయిందని రామేశ్వరంలో ఉన్న రామన్ కోవెల శాసనాలు చెప్తున్నాయి. ఈ సేతుకు ఉపయోగించిన రాళ్లు అగ్నిపర్వతాలు పేలినపుడు ఏర్పడిన రాళ్లు, లేదా, లైమ్ స్టోన్ అని సైంటిస్టులు నిర్ధారించారు. కానీ, అలాంటి రాళ్లు ఒక ధనుష్కోటి ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యం. మొత్తానికి ఈ వంతెన ఏడువేల ఏళ్ళకు ముందు నుంచే ఉందని స్పష్టమైన ఆధారాలు లభించాయి. కార్బన్ డేటింగ్, ఇతర పరీక్షల్లో రామసేతు రామాయణం కాలం నాటిదే అని సైంటిస్టులు తేల్చారు. 1960లో నాసా ఒక సాటిలైట్ పిక్చర్ ని తీసింది. ధనుష్కోటి నుంచి శ్రీలంక మధ్య ఉన్న ఈ వారధి ఫోటో స్పష్టంగా కనిపించింది. ఈ వంతెనతో కూడిన శ్రీలంక ఒక కన్నీటి బిందువులా ఉందని కూడా నాసా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 2000వ  సంవత్సరంలో ఎన్డీవర్ షటిల్ రాడార్ మిషన్ లో భాగంగా తీసిన సాటిలైట్ ఫోటోలలో రామసేతు మరింత స్పష్టంగా కనిపించింది

 రామసేతు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. సముద్ర అలల తాకిడి, సునామీ వంటి ప్రమాదాల నుంచి దేశాన్ని, తీర ప్రాంతాన్ని తీరంలో ఖనిజ ప్రకృతి వనరులను ఆ సేతువు రక్షిస్తోంది. ప్రపంచంలో యురేనియంకి దీటుగా పనికొచ్చే అత్యంత విలువైన థోరియం నిలువలు అపారంగా ఉన్న మన సముద్ర తీరాన్ని ఇది కాపాడుతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే థోరియంలో 30% ఇక్కడే దొరుకుతుంది. అబ్దుల్ కలాంవంటివారు విద్యుత్ ఉత్పత్తికి యురేనియం బదులు థోరియం వాడాలనే సూచనలను చేసేవారు. 

2017లో రామసేతుపై డిస్కవరీ సైన్స్ ఛానల్ లో వచ్చిన డాక్యుమెంటరీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారత శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు మానవ నిర్మితమేనని ఆ ఛానల్ రుజువు చేసింది. అలాగే, భారతీయదాసన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్ ప్రొఫెసర్ ఎస్ఎం రామస్వామి నేతృత్వంలో 2003లో ఒక బృందం రామసేతుపై పరిశోధనలు చేసింది. రామనాథపురం పంబన్ లలో సేతువుపై వీరు పరిశోధనలు చేశారు. ఇక్కడ బీచ్ లో భూమి, సముద్రపు సుదీర్ఘ అలల తాకిడి వల్ల ఏర్పడ్డాయని, కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా ఇక్కడ తీరప్రాంతాల వయస్సు రామాయణ కాలంతో సరిపోతుందని వారు తేల్చారు .కోరల్ వేవ్ స్  బదులుగా ఉండే ఇసుక మధ్య ఇలాంటి వంతెనలు సహజంగా ఏర్పడడం సాధ్యం కాదని కూడా వారు చెప్పారు.

 మరి రామాయణంలో ఈ సేతు గురించి ఏముంది ? వానరవీరులలో ప్రముఖుడైన నలుడు విశ్వకర్మ కుమారుడు "నాపై సేతువు అని అతడే నిర్మించగలడు."ఆ సేతువుని నేను భరించగలను" అని సముద్రుడు రాముడికి చెప్పినట్టు రామాయణంలో శ్లోకాలు ఉంటాయి. సేతు నిర్మాణ కౌశలం నాకు తెలుసని, మన వానరసేనతో ఆ కార్యాన్ని నెరవేరుస్తానని అన్నాడు, నలుడు. శ్రీరాముడు సేతునిర్మాణనికి ఆజ్ఞాపిస్తే లక్షల మంది వానరవీరులు మహావృక్షాలను, పెద్దపెద్ద పొదళ్లను తీసుకొచ్చి, సముద్ర తీరానికి తెచ్చారు. ఏనుగులంత ఎత్తున బండరాళ్లను పర్వతాలను పెకలించి, యంత్ర సాయంతో సముద్రతీరానికి చేర్చారు,  వానరులు. యంత్రం గురించి రామాయణంలో ఉంది. ఆ యంత్రం ఏంటో తెలియదు. నలుడు సముద్రంపై సేతు నిర్మాణం ప్రారంభించాడు. వానరులు అంతా సహకరిస్తున్నారు. కొందరు పర్వతాలను తీసుకువచ్చారు. ఇంకొందరు దారికి అటు ఇటు కర్రలు పాతి వాటిని వరుస క్రమంలో గడ్డి పోచలను పెనవేసి కడుతున్నారు. ఏ రోజు ఎంత ఎంత దూరం కట్టారో కూడా, రామాయణంలో ఉంది. ఐదు రోజుల్లో ఈ వంతెన నిర్మాణాన్ని ముగించారు. వానరులు. ఆరో రోజు సముద్రానికి అవతల ఉన్న లంకలో సువేల పర్వతానికి చేరుకున్నారని వాల్మీకి రామాయణం యుద్ధకాండలో 69 నుంచి 73 వరకు ఉన్న సర్గలు చెబుతున్నాయి. ఇలా రామాయణంలో విశ్వకర్మ అంశతో పుట్టిన నలుడు రామసేతును నిర్మించాడని యుద్ధకాండలో స్పష్టంగా ఉంది. ఈ సేతువు 10 యోజనాలు వెడల్పు, 100 యోజనాలు దూరం ఉందని రామాయణం చెప్తుంది. యోజనం అంటే సుమారు ఎనిమిది మైళ్ళు ఆ లెక్కన ఎనిమిది వందల మైళ్ల దూరం ఈ సేతువును నిర్మించారని రామాయణం చెప్తుంది. ఇప్పుడు మనకు ఆధారాలుగా కనిపిస్తున్న రామసేతు 50 కిలోమీటర్లు. ఆ లెక్కన, మనం ఇప్పుడు చూస్తున్నది అసలు శ్రీలంకలో ఒక భాగం మాత్రమేనా? అసలు లంక సముద్రంలో మునిగిందా? అన్నది కూడా పరిశోధించాలి. పురాణాల్లో చెప్పిన లంకలో కొన్ని ఆనవాళ్లు మాత్రమే ఇప్పుడు శ్రీలంకలో కనిపిస్తున్నాయి. ద్వారకలాగే అసలు లంక కూడా సముద్రంలో మునిగిందా? మునిగితే, ఎక్కడుంది? అన్నది పరిశోధించాలి. అలా లక్షల సంఖ్యలో వానరులు రామసేతుని నిర్మించారు. ఇంకా ఎన్నో మిస్టరీలు రామసేతులాగే సముద్రంలో మునిగిపోయాయి. మన భారతదేశ చరిత్రకు మూలమైన రెండు ప్రధాన సాక్ష్యాలు సముద్రంలో కలిసిపోయాయి. ఒకటి, తేతాయుగం నాటి రామసేతు. ఇంకొకటి, ద్వాపరయగంలోని శ్రీకృష్ణుడు నడిచిన నేల ద్వారక. ఈ రెండిటిని లోతుగా అధ్యయనం చేస్తే, ఇప్పుడున్న చరిత్ర పుస్తకాలను అన్నిటిని మార్చాల్సి వస్తుంది.

వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో

No comments: