Wednesday, December 8, 2021

ఈ వేల్పుు ఎవరు?

 ఈ వేల్పుు ఎవరు?




సాహితీమిత్రులారా!



ఈ పద్యంలోని వేల్పుు ఎవరో చెప్పండి

అమరులు మేఘముల్ కుసుమ మాస్యము, హేమము, భాస్కరుండు, మా

సము, నురగంబు శంకరుని, చాపము, పంకము, పాండవా గ్రజుం

డ మృతకరుండ నందగిన త్య్రక్షర సంజ్ఞల మధ్య వర్ణముల్

క్రమమున నాహ్వయంబొనరఁ గల్గిన వేలుపు మిమ్ము బ్రోవుతన్


ఈ పద్యంలోని మూడక్షర సంజ్ఞలు గుర్తించి వాటి మధ్య అక్షరాలద్వారా

అందులోని వేల్పెవరో గమనించగలరు. కామెంట్స్ లో ఉంచండి.

No comments: