Friday, July 21, 2023

ముద్రారాక్షసమ్ - చాణక్య

 ముద్రారాక్షసమ్ - చాణక్య 



సాహితీమిత్రులారా!

ఈరోజు మనం చెప్పుకోబోయేది సామాన్యమైన కథ కాదు. తన కోపంతో ఒక రాజవంశాన్ని పడగొట్టి, మరో రాజవంశాన్ని నిలబెట్టిన రాజనీతివేత్త కథ. ప్రపంచ చరిత్రలోనే అత్యంత మేధావిగా పేరు పొందిన ఆ రాజనీతివేత్త మన చాణక్యుడు. ఆయనకు వచ్చిన కోపం ఎంతో బలమైన నందరాజ వంశాన్ని నాశనం చేసింది. ఆయనకు కలిగిన అనుగ్రహం సుస్థిరమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఆయన రచించిన అర్థశాస్త్రం ఇప్పటికీ అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలిచింది. అటువంటి చాణక్యుని రాజనీతిపై, అతని ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయన్న విషయంపై సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం వ్రాయబడ్డ గ్రంథమే ఈ ముద్రా రాక్షసమ్. ఈ గ్రంథ రచయిత విశాఖదత్తుడు. ఈ విశాఖదత్తుడు ఒక రాజవంశీయుడు. తన తాతగారు ఒక సామంతరాజనీ, తన తండ్రి ఒక మహరాజనీ ఆయన ఈ గ్రంథంలోనే చెప్పుకున్నాడు. ఇక ముద్రారాక్షసం కథలోకి వద్దాం. ఈ నాటకానికి వ్యాఖ్యానం చేసిన డుంఢిరాజు ఉపోద్ఘాతంతో కలిపి చెప్పుకుంటే మనకు కథ స్పష్టంగా అర్థమవుతుంది. 

ఇక ముద్రారాక్షసమ్ కథలోకి ప్రవేశిద్దాం.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

No comments: