Monday, August 22, 2022

నాలుగు స్వరాలతో పద్యం

 నాలుగు స్వరాలతో పద్యం




సాహితీమిత్రులారా!



పాదానికి ఒక అచ్చు చొప్పున నాలుగు పాదాలకు

నాలుగు అచ్చులతో కూర్చిన పద్యం ఇది

దండి కావ్యాదర్శం లోనిది.


అమ్నాయానా మాహాన్త్యావాగ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:

భోగోలోగో మోదో మోహోధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే

                                                                                          (కావ్యాదర్శమ్ -3-84)

అర్థం -

అమ్నాయానాం - వేదాలలో, అన్త్యా - చివరిదైన ఉపనిషత్తు, గీతీ: - గానములను, ఈతీ: - ఈతిబాధలుగాను,  ప్రీతీ: - దారాపుత్రాదులందు ప్రేమలను, భీతీ: - భయస్వరూపములైనట్టివిగాను, అహ - చెప్పుచున్నది. భోగ: - విషయోపభోగము, రోగ: - రోగహేతువు, మోద: - సాంసారిక సుఖానుభవము, మోహ: - అవివేకరూపమైనది, అందుచే, క్షేమే - పరమాదరహితమైన, దేశే - ఏకాంత ప్రదేశంలో, ధ్యేయేవా - ధ్యేయమగు పరమాత్మస్వరూపంనందు, ఇచ్ఛేత్ - మనసును నిలుపుటకు కోరుకొనవలెను.


అమ్నాయానా మాహాన్త్యావా

గ్గీతీ రీతీ: ప్రీతీభీతీ:

భోగోలోగో మోదో మోహో

ధ్యేయే వేచ్ఛేద్ధేశేక్షేమే


మొదటిపాదంలో అకారము(అ,ఆ - అచ్చులు)

రెండవపాదంలో ఇకారము (ఇ,ఈ - అచ్చులు)

మూడవపాదంలో ఓ కారము(ఒ, ఓ - అచ్చులు)

నాలుగవపాదంలో ఏ కారము(ఎ,ఏ - అచ్చులు)

లతో కూర్చబడింది. గమనించగలరు.


No comments: