Tuesday, May 25, 2021

దాగున్న నాలుగోపాదం

 దాగున్న నాలుగోపాదం




సాహితీమిత్రులారా!



శ్లోకంలోని మూడు పాదాలను మాత్రమే కవి చెబుతాడు.
నాలుగవపాదం ఆ మూడు పాదాలలోనే గూఢంగా ఉంటుంది కనుక్కోవాలి.
దీన్ని గూఢచతుర్థి అంటారు.
ఈ శ్లోకం చూడండి.

పాతాతురాణాం బోధైక్య
మయో ధుర్యాప్తి సూ స్సతామ్
దలితై నస్సముదయ:


ఇది శ్లోకంలోని మూడు పాదాలు. నాలుగవపాదం గూఢంగా ఉంది 

దాన్ని కనుక్కోవాలి. అదెలా అంటే చూడండి.

పాతాతురాణాం బోధైక్య
యో ధుర్యాప్తి సూ స్సతామ్
లితై స్సముదయ:
రంగుల్లోను పెద్దగా ఉన్న అక్షరాలను
వరుసగా వ్రాసిన 4వ పాదమవుతుంది.
అది
పాతు వో మధుసూదన:

ఆతురాణామ్ - ఆపన్నులను, పాతు - రక్షించువాడు,
బోధైక్యవయ - నిత్యమైన జ్ఞానములకంటె వేరుకాని వాడు,
(అద్యైతమతంలో జ్ఞానానికి బ్రహ్మకు భేదంలేదు.)
సతాం ధురి ఆప్తిసూ: - జగత్తుకంటె అధిక సత్తావంతుడు
అంటే పారమార్థిక సత్తాశాలియైనవాడు,
దలిత ఏన స్పదయ - పాపసంతానమును విదిలించెడి,
మధుసూదన: - నారాయణుడు, వ: పాతు - మిమ్ము రక్షించుగాత!

పై రంగు గల అక్షరాలలో వబయోరభేద: -  అను
నియమంప్రకారం బో - అనేది వో అవుతుంది.

No comments: